E-Paper
Advertisement

TG Group 2 : తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా ?

TG Group 2 : తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా ?
Advertisement

Group 2 Postpone in Telangana : తెలంగాణ గ్రూప్ 2 వాయిదా పడనుందన్న వార్త ఉదయం నుంచి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది జులై నెలలో డీఎస్సీ, ఆగస్టు నెలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావించింది. ఈ మేరకు TGPSC ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. అభ్యర్థులు కూడా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ, ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వెంటవెంటనే ఉండటంతో పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలన్నది వారి డిమాండ్. నిరుద్యోగుల డిమాండ్ దృష్ట్యా గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిరుద్యోగుల డిమాండ్ దృష్ట్యా గ్రూప్ 2 వాయిదా వేస్తే.. మళ్లీ డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అభ్యర్థులకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరో 3 నెలల సమయం అదనంగా ఉంటుంది.

Advertisement

Also Read : హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నా వెనుక కారణం అదేనా?

కాగా.. గ్రూప్ 2 పోస్టుల్ని 2000కు, గ్రూప్ 3 పోస్టుల్ని 3 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 లో :100 శాతంలో మెయిన్స్ కు ఎంపిక చేసి.. 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేయగా.. దానిపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యాశాఖతో దీనిపై చర్చించి తుదినిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో గ్రూప్ 2 వాయిదా వేస్తారా లేక డీఎస్సీ వాయిదా వేస్తారా అన్నదానిపై నేడు స్పష్టత రానుంది.

Advertisement

ఇక తెలంగాణలో గత నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఈ నెలలోనే విడుదల చేయనుంది. ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు వెళ్లనున్నారు. టీజీపీఎస్సీ మొత్తం 563 స్థానాలకు ప్రిలిమ్స్ నిర్వహించింది. జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×