E-Paper
Advertisement

Telangana:మంత్రి వర్గ విస్తరణకు ఆషాఢం బ్రేక్!!

Telangana:మంత్రి వర్గ విస్తరణకు ఆషాఢం బ్రేక్!!
Advertisement
  • మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం
  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊపందుకున్న ప్రక్రియ
  • తమ వర్గం వారికే ఇవ్వాలని పట్టుబడుతున్న సీనియర్లు
  • ఐదారు రోజులుగా ఢిల్లీ లోనే మకాం వేసిన రేవంత్
  • విస్తరణ తేదీ కూడా ఖరారంటూ వార్తలు హల్ చల్
  • ఆషాఢ మాసంలో విస్తరణకు బ్రేక్ ఇవ్వాలని సీనియర్ల సూచన
  • శ్రావణ మాసం శుభముహూర్తాలకు అనుకూలం
  • మరో నెల్లాళ్ల పాటు విస్తరణ కోసం వేచిచూడాల్సిందే

Telengana Cabinet Extention postponed due to the not having good days

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసి ఆరు నెలలు పూర్తయి ఏడో నెల కొనసాగుతోంది. మార్చి నెల నుంచే మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు దానికి సంబంధించిన ఎన్నికల కోడ్ మంత్రి వర్గ విస్తరణకు ఆటంకంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. దీనితో మళ్లీ మంత్రి వర్గ విస్తరణపై ఆశలు రేకెత్తాయి. ఇందుకు తగినట్లుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో అదిగో మంత్రి వర్గ విస్తరణ అంటూ మీడియాలో అత్యుత్సాహంగా తేదీలు కూడా ఖరారైపోయాయి.సీఎం ఐదారు రోజులుగా ఢిల్లీ పెద్దలను కలిసి మంత్రి వర్గ విషయంలో క్లారిటీ కూడా తీసుకున్నారు. ఇంతలో ఏమయిందో హటాత్తుగా మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం కానున్నట్లు సంకేతాలు వచ్చాయి.

Advertisement

మళ్లీ మొదటికొచ్చిన సమస్య

మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి వారు తమ వారికి పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అయినా ఫైనల్ నిర్ణయం రేవంత్ కే అధిష్టానం అప్పజెప్పినట్లు సమాచారం. ఇక అదంతా పక్కన పెడితే అయితే అందరూ ఊహిస్తున్నట్లుగా మంత్రి వర్గ విస్తరణ మరో నెల రోజులు ఆలస్యం కానుంది. ఇందుకు కారణం లేకపోలేదు. జులై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అయింది. సాధారణంగా తెలుగు రాష్ట్రలలో ఆషాఢం సెంటిమెంట్ ఉంది. ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలకు ముహూర్తం కూడా ఉండదు. ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసం శుభ ముహూర్తాలకు సెంటిమెంట్ గా మంచిదని భావిస్తారు. పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు ఆషాఢ మాసంలో మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేసుకోవడం ఉత్తమం అని రేవంత్ కు సూచించినట్లు సమాచారం.

Advertisement

పట్టుబిగిస్తున్న సీనియర్లు

సీఎం రేవంత్ తో కలుపుకుని ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో 12 మంది మంత్రులు ఉన్నారు. అయితే తొలిసారి మంత్రి వర్గంలో కొన్ని నియోజకవర్గాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు తమకు మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి వర్గంలో ఎవరికీ చోటు దక్కలేదు. ఈ సారైనా తమకు పదవి దక్కాలని కోరుకుంటున్నారు. అలాగే మైనారిటీ వర్గాలనుంచి ప్రాతినిధ్యం దక్కలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడానికి మరింత సమయం కావలసి ఉంది. దీనికి తోడు ఆషాఢం కలిసొచ్చింది అధిష్టానానికి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×