E-Paper
Advertisement

Sadabainama: సాదాబైనామాల సమస్యలకు సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో జీవో జారీ..!

Sadabainama: సాదాబైనామాల సమస్యలకు సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో జీవో జారీ..!
Advertisement

Sadabainama: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్.ఓ.ఆర్. చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందని, అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫ్ఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడంవల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు జీ.ఓ. 76 ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా దరఖాస్తును పెండింగ్ లో ఉన్నాయని, వీటన్నింటికీ పరిష్కారం లభించబోతుందని తెలిపారు.

ఆధార్ మాదిరిగానే భూధార్..

నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలల్లో ప్రయోగాత్మమకంగా రీ సర్వే నిర్వహించామని, ఇందులో ప్రతీ సర్వే నెంబర్ కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించడం జరిగిందని అన్నారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ప్రతీ జిల్లలో 70 గ్రామాల్లో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. దశల వారిగా భూ సర్వే నిర్వహించి భూధార్ ను ఇస్తామని, రాష్ట్రం లోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చేలిపారు. ఇక ధరణి పోర్టల్ లోని లోసగులను ఆసరాగా చేసుకొని కొంత మంది మీ-సేవ నిర్వాహకులతో కలిసి 3.99 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు.

Advertisement

Also Read: Gas Refill Booking: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. రీఫిల్ బుకింగ్ గడువు పెంపు, ఈసారి 35 రోజులు

గత ధరణి పోర్టల్‌ను..

తప్పుచేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని తెలిపారు. శాసన మండలిలో సభ్యులు తాతా మధుసుదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ధరణి పోర్టల్ ను నాలుగు గోడల మధ్య ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి తీసుకొచ్చారని, దీని వల్లే కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్‌లో 40, 41 మాడ్యుల్స్ ఉంటే భూ భారతి పోర్టల్ లో 6 కు కుదించామని, ధరణి పోర్టల్ ను అర్ధరాత్రి ఒక్కరోజు మార్చేది కాదని, దశలవారీగా మార్పులు చేసుకుంటూ వస్తున్నామని, ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో భూ భారతి పోర్టల్ ను తెస్తామని తెలిపారు.

Advertisement

Also Read: Redmi Note 15 SE: బడ్జెట్ ధరలో కొత్త రెడ్మి నోట్ ఫోన్.. 108MP కెమెరా, క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, ఇంకా..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×