E-Paper
Advertisement

Rajya Sabha Election: 3 నామినేషన్ల తిరస్కరణ.. ఎన్నికలు లాంఛనమే..!

Rajya Sabha Election: 3 నామినేషన్ల తిరస్కరణ.. ఎన్నికలు లాంఛనమే..!
Advertisement

Telangana Rajya Sabha Election: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల దాఖలకు మంగళవారం సాయంత్రంతో గడువు ముగిసింది. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేసిన 3 నామినేషన్లే చెల్లుబాటు అయ్యాయి. రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర బరిలోకి దిగారు. ఈ ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.

రాజ్యసభ అభ్యర్థులుగా మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. శ్రమజీవి పార్టీ అభ్యర్థులుగా జాజుల భాస్కర్‌,
భోజరాజు కోయల్కర్‌ నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్‌ రాథోడ్‌ పోటీకి దిగారు. ఈ ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

Advertisement

రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది శాసన సభ్యలు మద్దతు తెలిపాలి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఎమ్మెల్యేల మద్దతుతో నామినేషన్లు వేశారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థులకు శాసనసభ్యుల మద్దతు లేదు. అందువల్లే శ్రమజీవీ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డి తిరస్కరించారు.

కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ , బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక లాంఛనమే కానుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×