E-Paper
Advertisement

Telangana Govt: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.. నేడు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..

Telangana Govt: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.. నేడు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..
Advertisement

Telangana Govt: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణంగా గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్తగా, ప్రధానిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంగా మన్మోహన్ సింగ్ ను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు.

మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలిసిన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా పలు రాష్ట్రాలు సీఎంలు మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ తమ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి ఆర్థిక వేత్తను దేశం కోల్పోయిందని ఈ సందర్భంగా మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: Manmohan Singh Dead: మాజీ ప్రధాని మృతికి 7 రోజుల సంతాపం ప్రకటించిన కేంద్రం.. ప్రభుత్వ లాంఛనాలతో అంతక్రియలు

తెలంగాణలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల వారం రోజులపాటు సంతాపదినాలు పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నేడు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇతర మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ లు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×