E-Paper
Advertisement

Street Dogs : మళ్లీ మొదలైన కుక్కల బెడద.. నిజాంపేటలో తండ్రీకూతుళ్లపై దాడి..

Street Dogs : మళ్లీ మొదలైన కుక్కల బెడద.. నిజాంపేటలో తండ్రీకూతుళ్లపై దాడి..
Advertisement

Street Dogs : హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుక్కల బెడద మొదలైంది. గతంలో పలుమార్లు చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటనలో పలువురు మృతి చెందడంతో హాట్ టాపిక్ గా మారిన విషయం.. మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. రోజు ఈ తరహా ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. కుక్కల దాడి ఘటనలో పలువురు ప్రాణాలను కోల్పోగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.

కాగా ఆదివారం ఉదయాన్నే నిజాంపేట‌లో తండ్రీ కూతుళ్ల‌పై వీధికుక్క దాడి చేయడం కలకలం రేపింది. నిజాంపేటలోని భండారీ లే అవుట్‌కు చెందిన న‌రేష్‌ కుమార్, అతని కూమార్తెపై వీధి కుక్క దాడి చేసింది. న‌రేష్‌కుమార్ అనే వ్యక్తి కాలిని కొరికి కండ పీకేసింది. తండ్రితోపాటు ఐదేళ్ల కూమార్తెకు తలకు కూడా గాయాలయ్యాయి. గత నెలలో ఇదే కాలనీలో పార్కు వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్క లాకెళ్లింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం నిజాంపేట్ రోడ్డు లోని హోలీ స్టిక్ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×