E-Paper
Advertisement

Telangana Crop Insurance : అన్నదాతకు పంట బీమా.. ఎప్పుడంటే?

Telangana Crop Insurance : అన్నదాతకు అండగా నిలిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పంట బీమాపై దృష్టి సారించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టపోయే రైతన్నకు బీమా కల్పించి ఆదుకోవాలన్న ఉద్దేశంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Telangana Crop Insurance : అన్నదాతకు పంట బీమా.. ఎప్పుడంటే?
Advertisement
Telangana news today

Telangana Crop Insurance(Telangana news today) :

అన్నదాతకు అండగా నిలిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పంట బీమాపై దృష్టి సారించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టపోయే రైతన్నకు బీమా కల్పించి ఆదుకోవాలన్న ఉద్దేశంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను అమల్లోకి తీసుకువస్తారా? లేదంటే కొత్తగా పంటల బీమా పథకానికి రూపకల్పన చేస్తారా అన్న విషయంపై క్లారిటీ రానుంది. దీనిపై త్వరలోనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్నదాతల కోసం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కావడంతో వచ్చే ఏడాది నుంచే ఈ పథకం అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్‌ సర్కార్‌.

Advertisement

మరోవైపు దేశవ్యాప్తంగా పంట బీమా అమలవుతండగా ఒక్క తెలంగాణలో మాత్రమే ఈ స్కీం అందుబాటులో లేదు. పీఎం ఫసల్‌ బీమాతో ఏ మాత్రం ఉపయోగం లేదని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే 2020లో బయటకు వచ్చింది. దీంతో ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోయారు. వారికి పసల్‌ బీమా యోజన అందలేదు. అయితే ప్రస్తుతం రేవంత్ సర్కార్‌ దీనిపై దృష్టి సారించింది. పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో పంట బీమాపై కసరత్తు చేస్తోంది.

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోచన తెలంగాణలో ప్రవేశపెట్టినా, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీం తీసుకువచ్చినా పంట బీమా పథకం 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. రాష్ట్రంలో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కాబట్టి వీరికి బీమా ప్రీమియం కాకుండా చూడాలంటున్నారు. కాగా.. ఈ పథకానికి సంబంధించి ఖరీఫ్‌ కోసం మే నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసి లోనింగ్‌, నాన్‌ లోనింగ్‌ రైతులందరికీ పంట బీమా వర్తింపజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×