E-Paper
Advertisement

Telangana Congress : 2023 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు

Telangana Congress : 2023 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు
Advertisement

Telangana Congress : 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గెలుపు కోసం కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు బాహుబలి టీంను సిద్దం చేస్తోంది అధిష్టానం. కొత్త కమిటీ నేడో, రేపో వస్తుందనే అంచనాలుండగా ఇందులో ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, 17–18 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు, 120 మంది కార్యదర్శులు ఉండనున్నట్టు సమాచారం.

కొత్త కమిటీలో సీనియర్లు, జూనియర్లు, యువత కలబోతగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత, సామాజిక సమతుల్యత అనే ద్విముఖ వ్యూహంతో కమిటీని కూర్చారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. టీపీసీసీ ప్రతిపాదన ప్రకారం…కొత్త కమిటీలో ప్రస్తుతమున్న ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లనూ కొనసాగిస్తారని, వారికి తోడుగా వైస్‌ ప్రెసిడెంట్లకు పదోన్నతులిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 10 మంది సీనియర్‌ ఉపాధ్యక్షుల సంఖ్యను 17 లేదా 18కి పెంచుతారని భావిస్తున్నారు.

Advertisement

ఉపాధ్యక్షులకు లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వీరికి తోడు అనూహ్యంగా పెరుగుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను అసెంబ్లీ క్లస్టర్ల ఇంచార్జులుగా నియమిస్తారని సమాచారం. ఇప్పటిదాకా 35–40 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తుండగా ఆ సంఖ్యను 70కి పెంచి క్లస్టర్‌ బాధ్యతలిస్తారని తెలుస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×