E-Paper
Advertisement

తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!

తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!
Advertisement

Colleges Bandh: తెలంగాణ విద్యాశాఖలో గత కొంతకాలంగా నలుగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం ఇప్పుడు రోడ్డెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ (BC JAC) నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మద్దతు ప్రకటించిన యాజమాన్యాలు
బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ పిలుపునకు ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి భారీ మద్దతు లభించింది. ‘తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్’ తో పాటు ‘తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్’ కూడా ఈ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. కాలేజీల యాజమాన్యాలు కూడా బంద్‌కు మద్దతు తెలపడంతో నేడు డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల నిర్వహణ పూర్తిగా నిలిచిపోనుంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ బంద్ పరిధిలోకి రానున్నారు.

Advertisement

ఆర్థిక సంక్షోభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు
ప్రభుత్వం నుంచి రావాల్సిన వందల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. భవనాల అద్దెలు చెల్లించలేక, అధ్యాపకులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక విద్యాసంస్థల నిర్వహణ భారం కాబోతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే ఈ విరామ నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు పేర్కొంటున్నారు.

తక్షణమే విడుదల చేయాలి..
ఈ సందర్భంగా బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో పాటు విద్యాసంస్థల మనుగడను కూడా దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు, యాజమాన్యాలకు ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ప్రభుత్వ తీరుపై పోరాడుతామని హెచ్చరించారు. ఈ బంద్ నేపథ్యంలో విద్యాశాఖ లేదా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Also Read: మహిమా? సైన్సా? వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.. కాకినాడలో అరుదైన వింత!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×