E-Paper
Advertisement

రాష్ట్ర జనాభా 3.55 కోట్లు, దేశానికి దిక్సూచిగా తెలంగాణ సర్వే, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర జనాభా 3.55 కోట్లు, దేశానికి దిక్సూచిగా తెలంగాణ సర్వే, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
Advertisement

Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే గణాంకాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయం సాధించడంలో ఈ నివేదిక ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఒక కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలను సిబ్బంది కలిశారు. ఇది మొత్తం కుటుంబాలలో 97.10 శాతంగా నమోదైంది. ఈ సర్వే ద్వారా మొత్తం 3 కోట్ల 55 లక్షల 50 వేల 759 మంది జనాభా వివరాలను ప్రభుత్వం సేకరించింది. లక్షా మూడు వేల మంది ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయిలో కష్టపడి ఈ డేటాను క్రోడీకరించారు.

Advertisement

సర్వేలో వెల్లడైన కులాల వారీ గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం 56.36 శాతంతో అతిపెద్ద విభాగంగా నిలిచింది. ఎస్సీలు 17.42 శాతం ఉండగా ఎస్టీలు 10.43 శాతంగా నమోదయ్యారు. ఓబీసీ వర్గం 15.79 శాతంగా ఉంది. కులం లేదని సుమారు 4 శాతం మంది స్వచ్ఛందంగా వెల్లడించారు. సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిలో ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని పకడ్బందీగా నమోదు చేశామని మంత్రి వివరించారు. ఎక్స్ పర్ట్స్ కమిటీ సూచనల మేరకే ప్రభుత్వం ఈ బాధ్యతను పూర్తి చేసింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కుల గణన దేశానికే ఒక రోల్ మోడల్ అని పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనలో ఈ డేటాను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం మందబలంతో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో కేంద్రం ముందడుగు వేయాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రజలందరూ www.des.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం సాధించడమే లక్ష్యంగా ఈ గణాంకాలను సంక్షేమ పథకాలకు అనుసంధానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

ALSO READ: హైదరాబాద్‌లో ఘోరం.. ఆభరణాల పేరుతో రూ.50 కోట్ల మోసం, సుకేష్ గుప్తాపై మరో కేసు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×