E-Paper
Advertisement

Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం
Advertisement

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రైతు రుణమాఫీతోపాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. రుణమాఫీ అర్హతలు, విధివిధానాలకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా హైదరాబాద్ లోని ఉమ్మడి ఆస్తులపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ పద్దులపై కూడా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

రైతు సంక్షేమమే ప్రధాన అజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా మద్దతు ధరపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి రూ. 39 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్ లో పలువురు అధికారులు పర్యటించి అధ్యయనం చేశారు.

Also Read: సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తాం: కిషన్ రెడ్డి

Advertisement

కాగా, ఆగస్టు 15 నాటికి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంటు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. ఇదే తరహాలో రుణమాఫీ విషయంలో కూడా మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×