E-Paper
Advertisement

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 12 గ్రామాల్లో ‘SIR’ ప్రక్రియ బహిష్కరణ!

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 12 గ్రామాల్లో ‘SIR’ ప్రక్రియ బహిష్కరణ!
Advertisement

Telangana: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల పరిధిలోని 12 వివాదాస్పద గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ దశాబ్దాల నాటి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వేలను అంగీకరించేదే లేదని ఇక్కడి ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక-ఆర్థిక సర్వే (SIR – Social and Economic Registry/సామాజిక సమాచార సేకరణ) ప్రక్రియను ఆయా గ్రామాల ప్రజలు పూర్తిగా బహిష్కరించారు.

ఎన్యూమరేషన్ ఫారాలు తిరస్కరణ

Advertisement

సరిహద్దు గ్రామాలైన పరంధోళి, కోటా, లేండిగూడ, శంకర్లొద్ది, పరంధోళి తండా, ముకదంగూడ, మహరాజ్‌గూడ తదితర గ్రామాల్లో అధికారులు సర్వే చేపట్టేందుకు వెళ్లగా స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకునేందుకు ససేమీరా అన్నారు. బూత్ లెవెల్ అధికారులు (BLOs), సూపర్వైజర్లు గ్రామస్థులకు సర్వే ప్రాధాన్యతను వివరించి, అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతాపూర్, భోలాపటార్ పంచాయతీల పరిధిలో కొందరు ఫారాలు తీసుకున్నప్పటికీ, మెజారిటీ ఓటర్లు మాత్రం ఈ ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

Also Read: నలుగురు పిల్లల తల్లి కోసం టవరెక్కిన ప్రేమికుడు.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!

Advertisement

పహాణీలు లేవు.. రుణాలు రావు

గ్రామస్థుల ఆవేదన వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. గతంలో 2014 వరకు తాము బ్యాంకు రుణాలతో ఇక్కడి భూములను సాగు చేసుకున్నామని, కానీ ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా తమ భూములకు పహాణీలు (రైతు భూ రికార్డులు) జారీ చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. భూ రికార్డులు సరిగ్గా లేకపోవడంతో బ్యాంకు రుణాలు అందడం లేదు సరే సరే, కనీసం ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సహాయం (రైతు భరోసా వంటి పథకాలు) సైతం తమకు అందడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతూ తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు.

అటవీ శాఖ అడ్డంకులు

ఇదిలావుంటే, ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఈ భూములు రిజర్వ్ ఫారెస్ట్ (సరిహద్దు అడవుల) పరిధిలోకి వస్తాయంటూ చెట్లు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ శాఖ రావడం వల్ల తమ సాగు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని వివాదాస్పద గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల (తెలంగాణ, మహారాష్ట్ర) కలెక్టర్లు, తహసీల్దార్లు స్వయంగా తమ గ్రామాలకు వచ్చి క్షేత్రస్థాయిలో ఉమ్మడి సర్వే జరిపి, తమ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఏ రకమైన ప్రభుత్వ సర్వేలనూ తమ గ్రామాల్లోకి అనుమతించబోమని 12 సరిహద్దు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×