E-Paper
Advertisement

Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!

Telangana BJP : తెలంగాణ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం చావో రేవో అనే విధంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. ఇలా ముందుకెళ్తే.. తెలంగాణలో విజయం సాధించడం కష్టమే.. అందుకే కమలం పార్టీ నాయకులు కూడా ఎన్నికల వ్యూహాలు వేరే లక్ష్యంతో రచిస్తున్నారు.

Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!
Advertisement

Telangana BJP : తెలంగాణ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం చావో రేవో అనే విధంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. ఇలా ముందుకెళ్తే.. తెలంగాణలో విజయం సాధించడం కష్టమే.. అందుకే కమలం పార్టీ నాయకులు కూడా ఎన్నికల వ్యూహాలు వేరే లక్ష్యంతో రచిస్తున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హవా బలంగా వీస్తోందని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే.. మరికొందరు బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి తీసుకురావడనికే మోదీ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒక వేళ హంగ్ వస్తే.. బీజేపీ అధికారం చేజిక్కుంచుకుంటామని బీజేపీ నేతలు కొన్ని సందర్భాలు చెబుతున్నారు. అందుకు కారణం బీజేపీ ప్లానింగ్ అని తెలుస్తోంది.

Advertisement

బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీచేసినా ముందుగా ఫోకస్ చేసేది కచ్చితంగా గెలుస్తామని నమ్మకమున్న సీట్లపైనే. మిగతా సీట్లలో బలహీనంగా ఉంటే వాటిని పట్టించుకోదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే ప్లానింగ్‌తో ముందుకువెళుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు గెలవకపోతే.. ప్లాన్ బి అమలు పరుస్తారు. హంగ్ లాంటి పరిస్థితులు తీసుకువచ్చి కింగ్ మేకర్ లేదా బేరసారాలు జరిపి ఏకంగా కింగ్ కావచ్చు. అందుకోసమే బీజేపీ అన్ని సీట్లు గెలవడం కంటే 23 స్థానాలు గెలుస్తే చాలు. ఆ సీట్లు సాధించి మరో ప్రధాన పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్‌తో బేరసారలు జరిపి అధికారం సాధించే అవకాశాలున్నాయి.

బీజేపీ ఒకవేళ కనీసం 15 సీట్లు సాధించినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దూరమవుతాయి. ఇంతకుముందు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో కూడా దీనికోసమే బీజేపీ అనుబంధ పార్టీలైన ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, వీహెచ్‌పీ, యువమోర్చా నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×