E-Paper
Advertisement

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !
Advertisement

MLC By Elections in Telangana(TS today news): తెలంగాణలో హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 19,375 ఓట్ల ఆదిక్యంలో మల్లన్న ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మేజిక్ ఫిగర్ రాకపోవడంతో అతడిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. కాసేపట్లో అధికారులు తుదిఫలితం ప్రకటించనున్నారు. మల్లన్న గెలుపు ఖాయమవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. మొత్తం  అభ్యర్థుల్లో 47 మందిని ఎలిమినేషన్ ప్రక్రియలో తొలగించారు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ కూడా ఎలిమినేట్ అయ్యారు. 47 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్నకు అత్యధిక మెజారిటీ ఉంది. గెలుపు కోసం కావాల్సిన ఓట్లు లేకపోవడంతో రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల

మెజారిటీ తీన్మార్ మల్లన్నకు రావడంతో కౌంటింగ్ సెంటర్ వద్దకు భారీగా కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు చేరుకుంటున్నారు. బాణసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×