E-Paper
Advertisement

Mallanna New Party: కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న

Mallanna New Party: కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న
Advertisement

Teenmaar Mallanna New Party: ఎమ్మెల్సే తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి రాజ్యాధికార పార్టీ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఈ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ జెండా – ప్రతీకలు

Advertisement

పార్టీ జెండాలో ఒకవైపు వరి కంకులు, మరోవైపు కార్మికుల గుర్తును ఉంచారు. జెండా రంగులలో ఆకుపచ్చ రైతుల కష్టాన్ని సూచిస్తే, ఎరుపు కార్మికుల శ్రమకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ జెండా డిజైన్‌ను రాజేశం రూపొందించినట్లు మల్లన్న తెలిపారు. రైతు, కార్మికుల కష్టం దేశానికి వెన్నెముక అని, ఈ రెండు వర్గాల గౌరవం కోసం పార్టీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ ఆవిష్కరణ సందర్భం

Advertisement

సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ భారతదేశంలో కలిసింది. ఆ శుభదినం నాడు కొత్త పార్టీని ప్రారంభించడం చాలా గర్వకారణం అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లిదండ్రులకు, బీసీల కోసం జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ మురళీ మనోహర్ వంటి మహనీయులకు నివాళి అర్పించారు.

బీసీల హక్కుల కోసం పోరాటం

పార్టీ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ మల్లన్న, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీసీలు. కానీ వారి హక్కులు, వాటాలు ఇప్పటికీ సరిగా లభించడం లేదు. మేము ఎవరి హక్కులు అడగడం లేదు. మాకు సరైన వాటా మాత్రమే కావాలి. మా వర్గాల ఆత్మగౌరవం కాపాడటమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం అని స్పష్టం చేశారు.

అలాగే, గతంలో మండలిలో మాట్లాడినప్పుడు.. తనను అణచివేయాలని చాలా మంది ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. అయినా వెనక్కి తగ్గకుండా బీసీల లెక్కలను సభ ముందు ఉంచానని, అసెంబ్లీలో మా వర్గాల వాణి వినిపించడమే తన ప్రమాణమని తెలిపారు.

రాజకీయ వ్యవస్థపై విమర్శలు

ప్రస్తుత రాజకీయ పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదని మల్లన్న విమర్శించారు. టికెట్ కోసం గాంధీ భవన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మా పార్టీలోనే టికెట్ లభిస్తుంది. సాధారణ కార్యకర్తకు అవకాశం దక్కుతుంది అని మల్లన్న స్పష్టం చేశారు.

అలాగే, తన పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు.. చాలా ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. తాజ్ కృష్ణ వద్ద ఫ్లెక్సీలను చింపేశారు. ఉదయం నుంచే మాకు హాల్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. అయినా మేము వెనక్కి తగ్గలేదు. చివరికి వట్టే జానయ్యతో కలిసి హాల్ మళ్లీ ఓపెన్ చేయించాం” అని వివరించారు.

పార్టీ వెబ్‌సైట్ ప్రారంభం

పార్టీ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. అధికారిక వెబ్‌సైట్‌ను మల్లన్న ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా, వారి అభిప్రాయాలను ప్రతిబింబించేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. ప్రత్యేకతగా, వెబ్‌సైట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను కూడా జోడించినట్లు తెలిపారు. ప్రజలు ఏం అడిగినా వాస్తవాలను చెబుతుంది అని మల్లన్న చెప్పారు.

త్యాగాల గౌరవం – కొత్త రాజకీయ ఆశ

మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ఎన్నో కుటుంబాలు త్యాగాలు చేశాయి. ఆ త్యాగాలకు నిజమైన గౌరవం లభించాలంటే మెజారిటీ వర్గాల ఆశలు నెరవేర్చాలి. మా పార్టీ అదే దిశగా పని చేస్తుంది అని చెప్పారు. పార్టీకి అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: హైడ్రా కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న ప్రకటించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ చర్చనీయాంశంగా మారింది. బీసీలకు, రైతులకు, కార్మికులకు ప్రాధాన్యం ఇస్తామని మల్లన్న.. ఇచ్చిన హామీలు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×