E-Paper
Advertisement

Supremecourt : తెలంగాణలో బిల్లులు పెండింగ్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Supremecourt : తెలంగాణలో బిల్లులు పెండింగ్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
Advertisement

Supremecourt : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తోంది. తాజాగా పెండింగ్ బిల్లుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో తాజాగా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కేసు నేపథ్యం..
తెలంగాణ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్‌ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. దీంతో ఆ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. అసెంబ్లీలోని ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ముద్ర వేయాలి. గవర్నర్ ఆమోదిస్తేనే ఆ బిల్లులు అమలు చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను తిరస్కరించడమో లేదంటే సూచనలు చేయడమో లేదంటే వెనక్కి తిప్పి పంపడమో గవర్నర్ చేయాలి. కానీ అలా చేయకుండా ఆ బిల్లులను పెండింగ్‌ లో ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

గవర్నర్‌తోపాటు గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా తెలంగాణ సర్కార్ తన పిటిషన్ లో పేర్కొంది. అయితే రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ బిల్లుల ఆలస్యంపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కేంద్రం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా .. తెలంగాణ గవర్నర్‌ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని సమాధానం చెబుతామని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసుపై మార్చి 27న తుదిపరి విచారణ జరగనుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×