E-Paper
Advertisement

Telangana news: మంత్రి, ఈసీపై కేసు.. జడ్జి సస్పెన్షన్.. సుప్రీంకోర్టు సీరియస్..

Telangana news: మంత్రి, ఈసీపై కేసు.. జడ్జి సస్పెన్షన్.. సుప్రీంకోర్టు సీరియస్..
Advertisement
Minister Srinivas goud news

Minister Srinivas goud news(Latest news in telangana):

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏకంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జయకుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎన్నికల అఫిడవిట్ కేసులో 10మంది ఈసీ అధికారులపై కేసులు నమోదు చేయాలన్న ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం ఆసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులకు ఎలా ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Advertisement

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్‌పై కేసులు నమోదు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఎలక్షన్ కమిషన్. సీఈసీ లేవనెత్తిన అంశాలు పరిగణలోకి తీసుకోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ఇచ్చిన తీర్పు అనివార్యమంటు జయకుమార్ ని సస్పెండ్ చేసింది సుప్రీం కోర్టు.

మరోవైపు.. అఫిడవిట్ కేసులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ని జిల్లా పోలీసులు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు పిటిషనర్ రాఘవేందర్ రాజు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద టూటౌన్ పోలీసులు రాఘవేందర్ రాజుకు నోటీసులు జారీ చేశారు. వాటిని సవాల్ చేస్తూ రాఘవేందర్ రాజు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారాయన. ఈ కేసు నుంచి శ్రీనివాస్‌ గౌడ్‌ని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని రాఘవేందర్‌ రాజు వాదిస్తున్నారు. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×