E-Paper
Advertisement

Mlas Disqualification: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు, బీఆర్ఎస్‌కు షాక్

Mlas Disqualification: ఎమ్మెల్యేల  పార్టీ ఫిరాయింపు అంశం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు, బీఆర్ఎస్‌కు షాక్
Advertisement

Mlas Disqualification: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేవలం మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వీలైనంత త్వరగా అంటే మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది.

Advertisement

తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అపరేషన్‌ సక్సెస్‌..పేషెంట్‌ డైడ్‌ అన్న సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.  మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.

గతంలో ఐదుగురు సభ్యుల గల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ప్రస్తావించింది ధర్మాసనం.  అప్పటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని పేర్కొంది.  దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటేనని, స్పీకర్‌కు కాల పరిమితి విధించాలని తన తీర్పులో ప్రస్తావించారు.

Advertisement

ALSO READ: దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. తాము విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని భావించారు. చివరకు న్యాయస్థానం.. స్పీకర్‌కు అప్పగించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చర్చ మొదలైంది.  ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ పార్టీ ఫైట్ చేయలేకపోతోందని గుసగుసలు లేకపోలేదు. అంతర్గత సమస్యలతో పార్టీ సతమతమవుతోందని అనుకుంటున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. వారిలో దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపూడి గాంధీ, మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్లు పార్టీ ఫిరాయించారంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×