E-Paper
Advertisement

Sunil Reddy : ఢిల్లీలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత.. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు..

Sunil Reddy : ఢిల్లీలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత.. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు..
Advertisement

Political news today telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఢిల్లీ వెళ్లి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరతానని టీపీసీసీ చీఫ్‌కు చెప్పారు. జిల్లా నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం చెబుతామని రేవంత్ స్పష్టంచేశారు.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం సునీల్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ దక్కకపోవడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి ప్రశాంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో సునీల్ రెడ్డి 27 శాతం పైగా ఓట్లు సాధించారు.

Advertisement

కొంతకాలంగా బీజేపీలో చేరడానికి సునీల్‌రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఆయన చేరికను నిజమాబాద్ ఎంపీ అర్వింద్ అడ్డుకున్నారని టాక్ వినిపించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో సునీల్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. స్థానిక నాయకత్వం అంగీకరిస్తేనే కాంగ్రెస్ కండువా కప్పుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సునీల్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరికపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×