E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్ వార్ రూమ్ కేసుపై స్టే.. పోటీసులకు హైకోర్టు షాక్

Congress: కాంగ్రెస్ వార్ రూమ్ కేసుపై స్టే.. పోటీసులకు హైకోర్టు షాక్
Advertisement

Congress: పోలీసులు కావాలనే దాడి చేశారు. మా పార్టీ వార్ రూమ్ నుంచి కీలక సమాచారం ఎత్తుకెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా దాడి చేస్తారు? ఇది రాజకీయ కుట్ర.. అంటూ తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనపై గట్టిగా పోరాడుతోంది. సునీల్ కనుగోలు నడిపిస్తున్న కార్యాలయంపై పోలీస్ దాడిని పార్టీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఆందోళనకు చేశారు కాంగ్రెస్ శ్రేణులు.

అటు, వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలుకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సునీల్ పరారీలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా రాజకీయ వేడి రగులుతుండగానే.. హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ పోలీసులకు చుక్కెదురైంది.

Advertisement

వార్ రూమ్ ఘటనలో పోలీసుల విచారణపై స్టే విధించింది హైకోర్టు. 41 సీఆర్పీసీ నోటీసులపైనా స్టే ఇచ్చింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది.

వార్ రూమ్ పేరుతో కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారనేది పోలీసులు ఆరోపణ. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలతో పాటు బీజేపీ నేతలు టార్గెట్ గా మీమ్స్, ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారని కేసు పెట్టారు. వారం క్రితం మాదాపూర్ లోని సునీల్ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేసి.. కంప్యూటర్లను, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాస్త ఉద్రిక్తత తలెత్తింది. అప్పటి నుంచి సునీల్ కనుగోలు పరారీలో ఉండగా.. అతని కోసం ఢిల్లీకి పోలీస్ ప్రత్యేక టీమ్ వెళ్లింది. తాజాగా, హైకోర్టు స్టే తో కాస్త ఊరట లభించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×