E-Paper
Advertisement

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!
Advertisement

HYDERABAD: 13 జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ దంపతులు ఆందోళనకు దిగారు. లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. వెంటనే పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మొత్తం 1656 మందికి దంపతుల బదిలీలు నిర్వహించేందుకు ఫైల్ సిద్ధమైనప్పటికీ.. కేవలం 615 మందిని మాత్రమే బదిలీ చేయాలనుకోవడం దారుణమని అన్నారు. పూర్తిగా అర్హత ఉన్న క్యాడర్లను పక్కన బెట్టి 30శాతం దంపతుల బదిలీలు చేపట్టడంతో మిగతా వారి కుటుంబాల్లో ఆవేదన మిగిలిందని వాపోయారు.

Advertisement

అయితే వందలాదిగా ఉపాధ్యాయులు తరలిరావడంతో కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మెహరించి ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. టీచర్ల వెంట ఉన్న వారి పిల్లలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×