E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..

Hyderabad: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..
Advertisement

Hyderabad: ప్రకృతి వల్ల కావచ్చు.. మానవుల తప్పిదాల వల్ల కావచ్చు. ప్రకృతిలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి మనకు విచిత్రంగా అనిపిస్తాయి. రద్దీగా ఉన్న ప్రాంతంలో  భూమి లో నుంచి ఒక్కసారిగా పొగలు వస్తే.. ఇలాంటివి చెప్పడం కంటే చూడడమే బెటర్. ఆ తరహా సన్నివేశం హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

లొకేషన్.. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్.. సమయం కరెక్టుగా రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలైంది. అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ సన్నివేశాన్ని షాకయ్యారు.

Advertisement

ALSO READ: నేటివిటీని బట్టి సీటు.. జీవో నం 33పై తెలంగాణ హైకోర్టు తీర్పు

ఆ ప్రాంతం నుంచి కొందరు దూరంగా వెళ్లిపోయారు. ఈలోపు బిగ్ టీవీ టీమ్ అక్కడికి వెళ్లింది. ఈ తతంగాన్ని కెమెరాలో బంధించింది. ఈలోపు చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. ఏం జరుగు తోందంటూ కాసేపు అక్కడివారు చర్చించుకోవడం కనిపించింది.

Advertisement

చివరకు ఓ విషయం బయటకు వచ్చింది. కొద్దిరోజుల కిందట విద్యుత్ అధికారులు అండర్ గ్రౌండ్‌లో 11 కేవీ కేబుళ్లు అమర్చినట్టు తెలిసింది. దాని కారణంగానే పొగలు వచ్చాయని అంటున్నారు. అక్కడే ఉన్న మరికొందరు ఈ వాదనను తోసిపుచ్చారు.

భూ పొరల్లో ఏదో జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పొగలు వెనుక అసలేం జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×