E-Paper
Advertisement

Sircilla: కలర్ డబ్బా తేస్తేనే.. స్కూల్‌లోకి ఎంట్రీ.. ప్రిన్సిపాల్ వింత పనిష్‌మెంట్

Sircilla: కలర్ డబ్బా తేస్తేనే.. స్కూల్‌లోకి ఎంట్రీ.. ప్రిన్సిపాల్ వింత పనిష్‌మెంట్
Advertisement

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ స్కూల్లో వింత ఘటన జరిగింది. దసరా పండుగను ఆనందంగా జరుపుకున్న విద్యార్థులు.. తమ పాఠశాలకు రాగానే ప్రిన్సిపాల్ విధించిన నిబంధనలకు షాకైయ్యారు. అయితే దసరా సెలవుల తర్వాత ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం లేక, స్కూళ్లకు ఆలస్యంగా వచ్చారు చాలా మంది విద్యార్థులు. దీంతో ప్రిన్సిపాల్ కలర్ డబ్బా తేస్తేనే లోపలికి రానిస్తా అని వింత పనిష్‌మెంట్ ఇచ్చారు.

ప్రిన్సిపాల్ విధించిన నిబంధనలతో విద్యార్థులు షాక్‌
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కి దసర సెలవుల తర్వాత యథావిధిగా స్కూల్‌కి వచ్చారు.. అయితే ఆ విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం లేక స్కూల్‌కి లేటుగా వచ్చారు.. దీంతో విద్యార్థులు లేటుగా వచ్చినందుకు క్లాస్ రూమ్ లోకి టీచర్స్ రానివ్వలేదు..

Advertisement

కలర్ డబ్బా తీసుకువస్తేనే లోపలికి అనుమతి
ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళితే వారు వింత పనిష్మెంట్ విధించారు. అయితే లేటుగా వచ్చిన ప్రతి విద్యార్థి… స్కూల్ ఎదుట ఉన్న షాప్‌లో ఒక కలర్ డబ్బా కొని తీసుకురావాలని ఆదేశించారు. కలర్ డబ్బా కొనుక్కొని వస్తేనే లోపలికి అనుమతి అంటూ ఆదేశించారు. ఏమి చేసేది లేక విద్యార్థుల తల్లిదండ్రులు కొనుక్కొని వెళ్తున్నారు. ఈ వింత పనిష్మెంట్‌పై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విధ్యార్థుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ.. విద్యార్థి సంఘాలు ఫైర్..
ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానిక విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులపై.. ఇలాంటి శిక్షలు విధిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Also Read: నేడు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన..

ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణ జరపాలంటూ డిమాండ్
విద్యార్థులపై అనవసర ఒత్తిడి తీసుకువస్తున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, వెల్ఫేర్ శాఖ అధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×