E-Paper
Advertisement

లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?

లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని రా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి వారి మిల్లులలో వరి ధాన్యాన్ని దించుకోవడంపై సమీక్షించారు.

గ్రామాల వారీగా..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈసారి రబీ సీజన్లో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం పండిందని వాటిలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇప్పటికే 1లక్షా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని రేపట్లోగా మరొక 20 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని తెలిపారు. వాతావరణం అనుకూలించి అధికంగా ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. గ్రామాల వారీగా రైస్ మిల్లుల వారిగా ధాన్యాన్ని కేటాయిస్తామని జిల్లాలోని రా రైస్ మిల్లర్లు వారి మిల్లులో 40 శాతం కెపాసిటీతో మొత్తం 1లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు.

Advertisement

Also read: బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. ఇమామ్‌ల వేతనాలు రద్దు.. దీదీ అవినీతిపై విచారణ!

సన్న రకం వరి..

రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలో అధిక శాతం సన్న రకం వరి ధాన్యాన్ని రైతులతో పండించేందుకు ప్రభుత్వ ఆదేశాలు మేరకు రైతులను మోటివేట్ చేస్తున్నామని మిల్లర్లు కూడా రైతులకు సన్న రకం వరి ధాన్యాన్ని పండించడంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపికృష్ణ, రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారి జారీ చేయనైనది.

Advertisement

Also read: మెదక్ జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదల

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×