E-Paper
Advertisement

BRS: 50 ఇయర్స్ ఇండస్ట్రీ.. గులాబీ పార్టీలోకి మరాఠా నేతలు..

BRS: 50 ఇయర్స్ ఇండస్ట్రీ.. గులాబీ పార్టీలోకి మరాఠా నేతలు..
Advertisement

BRS: 50 ఇయర్స్ ఇండస్ట్రీ. 8 ఏళ్లలో ఫుల్ డెవలప్‌మెంట్. రైతుల పక్షాన పోరాటం. మోదీనే విలన్. ఇలా సాగింది సీఎం కేసీఆర్ ప్రసంగం. మహారాష్ట్ర నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు గులాబీ బాస్.

తన 50 ఏళ్ల అనుభవంతో 8 ఏళ్లలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్లని.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు. దేశంలో పండుతున్న వరిలో సగానికి పైగా తెలంగాణలోనే పండుతుందని వెల్లడించారు. నల్లచట్టాల కోసం పోరాటం చేసిన రైతులను ఉగ్రవాదులన్నారని.. వారికి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నేతలు ఈ పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్‌తో చేతులు కలుపుతున్నారు. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ నేత శరద్ జోషి ప్రణీత్ గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ పార్టీ కండువా కప్పి శరద్ జోషిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు మహారాష్ట్ర నేతలో గులాబీ పార్టీలో చేరారు.

ముందుగా భారీ కాన్వాయ్‌తో శరద్ జోషి ప్రణీత్, మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×