E-Paper
Advertisement

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Advertisement

Shabad Murder: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కథ విషాదాంతమైంది. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు అతని మృతదేహాన్ని కొత్తూరు సమీపంలో కనుగొన్నారు. కొత్తూరు మండలం పంజర్ల పరిధిలోని ఒక ఓపెన్ వెంచర్‌లో రాజ్ కుమార్ శవమై కనిపించాడు. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్ లభ్యం కావడంతో, అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పంజర్ల వెంచర్‌లో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ దేనని అధికారికంగా ధ్రువీకరించారు. ఆరుగురి ప్రాణాలను బలిగొన్న నిందితుడు, పోలీసులకు దొరకకుండా ఇలా చనిపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×