E-Paper
Advertisement

Ujjaini Mahankali Rangam : తెలంగాణ భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

Ujjaini Mahankali Rangam : తెలంగాణ భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
Advertisement

Ujjaini Mahankali Rangam Bhavishyavani(Telangana news live): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలు రెండోరోజు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సకలదేవతల పూజలతో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

ఈ ఏడాది బోనాలను సంతోషంగా అందుకున్నానని తెలిపారు. భక్తులందరినీ తన వద్దకు రప్పించుకున్నానన్నారు. ఏ ఆపద రాకుండా తనను కొలిచినవారికి అండగా నిలుస్తానని అభయమిచ్చారు. మామూలు బోనమైనా, మట్టిబోనమైనా, స్వర్ణబోనమైనా.. ఆ బోనాన్ని ఎవరు ఎత్తుకుని తీసుకొచ్చినా తనకు సంతోషమేనన్నారు. ఇలా చేయాలి, అలా చేయాలన్నవి పెట్టుకోవద్దన్నారు మాతంగి స్వర్ణలత.

Advertisement

ఈ ఏడాది కోరినన్ని వర్షాలు పడుతాయని, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని రంగం భవిష్యవాణిలో వినిపించారు. అందరూ సంతోషంగా జీవించాలని అన్నారు. ఏది ఎంతవరకు కావాలో అంతవరకే కోరుకోవాలని చెప్పారు. కష్టంలేకుండా తన దర్శనం జరిగితే.. భక్తులు సోమరిపోతులవుతారని అన్నారు. భక్తులకు ఎలాంటి రోగాలు సోకకుండా కాపాడుతానన్నారు. పంటలు పండించేందుకు మందులను వాడటం తగ్గిస్తే.. వ్యాధులు రాకుండా ఉంటాయని సెలవిచ్చారు మాతంగి స్వర్ణలత. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో నైవేద్యం సమర్పించి పూజలు చేయాలని చెప్పారు. ఈ రంగం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. భవిష్యవాణి ముగిసిన అనంతరం.. అమ్మవారి ఊరేగింపు ఘట్టం ప్రారంభమైంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×