E-Paper
Advertisement

Secunderabad : దక్కన్ మాల్ భవనంలో ముగ్గురు సజీవదహనం .. యాజమానులపై కేసు..

Secunderabad : దక్కన్ మాల్ భవనంలో ముగ్గురు సజీవదహనం .. యాజమానులపై కేసు..
Advertisement

Secunderabad : సికింద్రాబాద్ దక్కన్‌ మాల్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ముగ్గరి ఆచూకీ లభ్యంకాలేదు. మంటల్లో చిక్కుకుని కనిపించకుండాపోయిన వసీం, జునైద్, జహీర్ సజీవదహనమయ్యారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే మృతులను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ మాత్రం షెటర్లు మూసేందుకు మంటల్లోనే లోపలికి వెళ్లారు. మంటలను ఆర్పే క్రమంలో అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదుతో భవన యజమానులు మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెసిడెన్షియల్ భవనాన్ని కమర్షియల్ స్పేస్ గా మార్చారని యజమానులపై అభియోగాలు నమోదు చేశారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అగ్నిప్రమాదం జరిగిన దక్కన్ మాల్ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మంటల తీవ్రతకు భవనం పిల్లర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు దక్కన్ మాల్‌లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Advertisement

దక్కన్ మాల్ భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అగ్నిప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల్లో కాలిపోయిన భవనాన్ని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించారు. భవనంలో పూర్తిగా గాలించిన తర్వాత కూల్చివేయాలని నిర్ణయించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×