E-Paper
Advertisement

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..
Advertisement

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలోని రెసోనెన్స్ గురుకుల్ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య మత ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి తల్లిదండ్రుల మధ్య దాడికి దారితీసింది. హాస్టల్ గదిలో గోడపై మతపరమైన రాతలు రాయడం, వాటిని చెరిపివేయడం కారణంగా డిసెంబర్ 2న రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ జరిగింది.

ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, కొందరు తల్లిదండ్రులు క్యాంపస్‌కు వచ్చి ప్రిన్సిపాల్ గదిలో, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఒకరిని చెప్పుతో కొట్టగా, మరొకరిని గల్లా పట్టి కొట్టారు. లక్షల ఫీజులు చెల్లించి తమ పిల్లలను చేరిస్తే, ఇలాంటి అమానుష దాడులు జరగడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచిపెట్టడంపై మిగతా విద్యార్థుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల వసూలుపై ఉన్న శ్రద్ధ పిల్లల భద్రతపై లేదని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ గొడవ చివరకు బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×