E-Paper
Advertisement

Budvel : బుద్వేల్‌ లో భూముల అమ్మకం.. ఎకరా కనీస ధర ఎంతంటే?

Budvel : బుద్వేల్‌ లో భూముల అమ్మకం.. ఎకరా కనీస ధర ఎంతంటే?
Advertisement
Hyderabad land auction news

Hyderabad land auction news(Telangana news live):

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నగరం శివారు ప్రాంతాల్లో ధరలు ఆకాశ్నానంటుతున్నాయి. తాజాగా కోకాపేట భూములు ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ఎకరం రూ. 100 కోట్లకు అమ్ముడు పోయింది. నగరంలో చట్టపక్కల ప్రాంతాల్లోని భూములు భారీ ధరలు పలుకుతున్నాయి.

తెలంగాణ సర్కార్ ఒక్కో ప్రాంతంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతోంది. భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కోకాపేట భూముల వేలంగా సర్కార్ కు భారీ ఆదాయం వచ్చింది. తాజాగా మరో ప్రాంతంలో భూములను అమ్మకానికి పెట్టింది. బుద్వేల్ భూముల అమ్మకానికి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో బుద్వేల్‌ ఉంది. ఇక్కడ బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మౌలిక వసతులు కల్పించింది. అన్ని సౌకర్యాల సమకూర్చి అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. విస్తీర్ణం 3.47 ఎకరాలు నుంచి 14.33 ఎకరాల మధ్య ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఎకరా కనీస ధరను రూ.20 కోట్లగా నిర్ణయించారు. ఆగస్టు 6న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. ఆగస్టు 8న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈ నెల 10న ఈ -వేలం నిర్వహిస్తారు. బుద్వేల్ లో ఎకరా సగటున రూ. 30 కోట్లకు అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ భూమల వేలందా ద్వారా కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×