E-Paper
Advertisement

GOVERNOR : గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!

GOVERNOR : గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!
Advertisement

GOVERNOR : తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ఆమోదంపై విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని గరవ్నర్‌ సూచించిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి తమిళ సైతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డుపై గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ కు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని తమిళసై స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాలు త్వరగా జరగాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని గవర్నర్ కు స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×