E-Paper
Advertisement

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?
Advertisement
  •  ఆర్టీసీ ఎంసీ సజ్జనార్ ఆగ్రహం
  • ఎంక్వైరీ చేయాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, స్వేచ్ఛ: షాద్ నగర్ విద్యార్థులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. ఫుడ్ బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదెవరని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్‌లో బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని సజ్జనార్‌కు లేఖలో వివరించారు విద్యార్థులు గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ 35 కిలోమీటర్ల బస్ పాస్ పరిమితి సరిపోవట్లేదని లేఖలో వివరించారు. డిగ్రీ, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వారి కోసం 45, 60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితి పెంచాలని కోరారు. షాద్ నగర్ – మహబూబ్ నగర్ రూట్‌లో పల్లె వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌ను కోరారు.

స్పందించిన సజ్జనార్

Advertisement

షాద్ నగర్ విద్యార్థుల సమస్యల మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న మీడియా కథనాలపై రియాక్ట్ అయిన ఆయన, ఈ సమస్య మీద ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించారు.

కాసుల పంట
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట పండింది. బతుకమ్మ, దసరా పండుగల్లో కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు జనం. అక్టోబర్ 1 నుండి 15 తేదీ వరకు 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. దీనివల్ల రూ.307.16 కోట్ల ఆదాయం వచ్చింది. రెగ్యులర్‌గా తిరిగే సాధారణ సర్వీసులు కాకుండా 10,513 ఎగస్ట్రా బస్సులు నడిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీస్ కూడా మహిళలలకు ఉండటంతో బాగా కలిసి వచ్చింది అంటున్నారు అధికారులు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×