E-Paper
Advertisement

Telangana Government: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ కానీ ఉద్యోగులకు ఇక నో శాలరీ

Telangana Government: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ కానీ ఉద్యోగులకు ఇక నో శాలరీ
Advertisement

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వివరాల నమోదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబర్, సెల్ ఫోన్ వివరాలను ఆర్థిక శాఖ పోర్టల్‌లో అప్‌డేట్ చేయని ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరి వివరాలు తప్పనిసరిగా నమోదు కావాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలిపి మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. గత నెలలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ప్రతి ఉద్యోగి పేరు, హోదా, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలను ప్రతి నెల 10వ తేదీలోపు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే, ఈ నెల 16వ తేదీ వరకు కూడా సగం మంది ఉద్యోగుల వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు కాలేదు.

Advertisement

ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్?

ఆర్థిక శాఖ హెచ్చరికలు జారీ..

Advertisement

వివరాల నమోదులో జరుగుతున్న ఆలస్యంపై ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను తీవ్రంగా హెచ్చరించింది. ‘ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్లు వివరాలు ఇవ్వనివారికి ఈ నెల జీతం రాదు’ అని స్పష్టం చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే.. వివరాలు నమోదు చేయని ఉద్యోగుల జీతాల బిల్లులను నిలిపివేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

ALSO READ: Rohit Sharma: అన్ని ఫార్మాట్స్ లో 5 సెంచరీలకు పైగా చేసిన ఏకైక క్రికెటర్ గా రోహిత్..ఇక ఆసీస్ కు రాబోమంటూ ప్ర‌క‌ట‌న‌

ఈ నెల 25 అర్ధరాత్రి లోపు..?

ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరాలు అప్‌డేట్ చేయని ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి లోపు తప్పనిసరిగా ఆధార్, ఇతర వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఉద్యోగులు కూడా వెంటనే తమ వివరాలను నమోదు చేయాలని.. లేని పక్షంలో తమకూ ‘ఇదే ట్రీట్‌మెంట్’ అమలు అవుతుందని ఆర్థిక శాఖ హెచ్చరిక జారీ చేసింది. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంలో భాగంగా ఉద్యోగుల డేటాను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×