E-Paper
Advertisement

Revanth Reddy : వర్షాలపై కనీసం సమీక్ష చేయలేరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ? : రేవంత్ రెడ్డి

Revanth Reddy : వర్షాలపై కనీసం సమీక్ష చేయలేరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ? : రేవంత్ రెడ్డి
Advertisement
Revanth reddy comments on BRS Govt

Revanth reddy comments on BRS Govt(Latest news in telangana): హైదరాబాద్‌లో భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ విమర్శించారు. కనీసం వర్షాలు, ముంపు సమస్యలపై కనీసం సమీక్ష చేయకపోవడం బాధాకరమని అన్నారు.

ట్రాఫిక్ జామ్‌లతో భాగ్యనగంలో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని రేవంత్ అన్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు . హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ఇచ్చిన హామీలు ఏమైయ్యాయని నిలదీశారు.

Advertisement

ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×