E-Paper
Advertisement

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy: ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటువేయడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టి.కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరుపున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ గొంతు నొక్కి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కుట్రలను తిప్పి కొడుతామని స్పష్టం చేశారు. బీజేపీకి సరైన బుద్ధి చెబుతామన్నారు. కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదన్నారు. అందుకే దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని తెలిపారు.

Advertisement

కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏఐసీసీ చెప్పినట్లుగా నడుచుకుంటామని వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×