E-Paper
Advertisement

TSPSC: ఆర్టికల్ 317 ప్రకారం చర్యలు తీసుకోండి.. పేపర్ లీక్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు..

TSPSC: ఆర్టికల్ 317 ప్రకారం చర్యలు తీసుకోండి.. పేపర్ లీక్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు..
Advertisement

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్ పోరాటం మరింత ఉధృతం చేసింది. NSUI విభాగం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ లీకేజీలో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందన్నారు. గత గ్రూప్ 1 పరీక్ష పేపర్ సైతం లీక్ అయిందని.. ఎన్నారైలకు పేపర్లు అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు రేవంత్. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఇప్పుడు నేరుగా గవర్నర్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో గవర్నర్‌ తనకున్న విచక్షణాధికారాలను వాడాలని రేవంత్‌రెడ్డి కోరారు. మంత్రి కేటీఆర్‌నూ ప్రాసిక్యూట్ చేయాలని అన్నారు. టీఎస్‌పీఎస్సీలో జరిగిన అవకతవకలకు కేటీఆర్‌ మంత్రిగా ఉన్న ఐటీ శాఖే కారణమన్నారు. సిట్‌ విచారణను ఎదుర్కోవాల్సిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శి, సెక్షన్‌ ఆఫీసర్‌ను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 317 ప్రకారం టీఎస్‌పీఎస్సీలో బాధ్యులైన వ్యక్తులను గవర్నర్‌ సస్పెండ్‌ చేయొచ్చని.. తద్వారా పారదర్శకమైన విచారణ జరిగేందుకు అవకాశం ఉంటుందని తమిళిసైకి విజ్ఞప్తి చేశారు రేవంత్‌రెడ్డి బృందం.

Advertisement

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. పేపర్ లీకేజీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని.. తాను రాజ్యాంగ విధులకు లోబడి పని చేయాల్సి ఉంటుందని.. న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు గవర్నర్ తమిళిసై.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×