E-Paper
Advertisement

కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా.. రెండోసారి మాదే ప్రభుత్వం, సీఎం రేవంత్ శపథం

కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా.. రెండోసారి మాదే ప్రభుత్వం, సీఎం రేవంత్ శపథం
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని, ఆ కుటుంబాన్ని మళ్లీ అధికార పీఠం దక్కకుండా చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆయన స్పష్టమైన సవాల్ విసిరారు.

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ప్రజలు గమనించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం ఘోరీ కట్టిందని వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే విజయపథంలో నడిపించారో.. అదే రీతిలో ఇప్పుడు తాను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసి రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తల సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

పాలకుల తీరుపై కేసీఆర్ చేసిన చిల్లర మాటలు అనే విమర్శకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, వారి తీర్పును గౌరవించకుండా ఇంకా అహంకారంతో మాట్లాడటం కేసీఆర్ భ్రమలకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని, ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ హవా మాత్రమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయని, అభివృద్ధి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడంతో రాబోయే రోజుల్లో ఈ పోరు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కేసీఆర్ పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తుంటే.. మరోవైపు రేవంత్ రెడ్డి ఆ అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నారు. పీసీసీ కొత్త సారథితో కలిసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యమంత్రి విసిరిన ఈ సవాల్‌పై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Advertisement

ALSO READ: జగిత్యాల జైత్రయాత్ర మళ్లీ మొదలైంది.. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రాన్ని కాపాడుతుంది: జీవన్ రెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×