E-Paper
Advertisement

Rtc Employees: సీఎం రేవంత్ రెడ్డి చొరవతో 136 కుటుంబాల్లో సంతోషం

Rtc Employees: సీఎం రేవంత్ రెడ్డి చొరవతో 136 కుటుంబాల్లో సంతోషం
Advertisement

వారంతా వివిధ కారణాలతో ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయారు. మొత్తం 472 మంది వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇబ్బందులను వారు సీఎం ప్రజావాణిలో విన్నవించుకున్నారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని, తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. ఆ విన్నపాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆయా కుటుంబాలకు భరోసా నిచ్చారు. ఆయన చొరవతో నేడు 136మందిని తెలంగాణ ఆర్టీసీ తిరిగి విధుల్లోకి తీసుకుంది. వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది.

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఓ అపురూప ఘట్టంగా మిగిలిపోతుందని అంటున్నారు. తమకు ఉద్యోగాలు తిరిగి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య లకు వారంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు, సెక్యూరిటీ గార్డ్ లు ఉన్నారు.

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వాణి కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రజావాణి కీలకంగా పనిచేస్తోంది. కేవలం అర్జీలు స్వీకరించడమే కాదు, వాటి పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ప్రజావాణికి హాజరయ్యారు. ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన 472 మంది అర్జీలు ఇచ్చారు. తమ తప్పులు క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యకు వారు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీలో తొలగింపబడిన ఉద్యోగుల విషయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వచ్చింది. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చివరకు పరిష్కారం దొరికింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా సెర్ప్ సీఈఓ, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య సభ్యురాలిగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మెంబర్ కన్వీనర్ గా ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తుది నివేదిక ప్రకారం తొలి విడతలో 136మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 336 మంది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వినేందుకు బ్యాచ్ వారీగా తేదీలను కూడా ఖారారు చేసి షెడ్యూల్ ప్రకటించారు అధికారులు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×