E-Paper
Advertisement

Praja Bhavan : డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్.. కారణమిదేనా?

Praja Bhavan

Praja Bhavan : డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్.. కారణమిదేనా?
Advertisement

Praja Bhavan : జ్యోతిబా పూలే ప్రజా భవన్ ను ఇక డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రజా దర్బార్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

రాజరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులతో తొలగించారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మర్చారు. ప్రజా భవన్ ను ప్రజా సమస్యలు తీర్చే నిలయం తీర్చిదిద్దారు. అందులో భాగంగానే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు డిప్యూటీ సీఎం అధికారిక నివాసాన్ని ప్రజా భవన్ లోనే కేటాయించారు.

Advertisement

అయితే ముఖ్యమంత్రి నివాసం కోసం ఎంసీఆర్ హెచ్ ఆర్డీ భవనంలో ఉండేందుకు సకల సదుపాయాలు ఉన్నాయి. భద్రతాపరంగా అనుకూలంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీనిని ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. ఎంసీఆర్ హెచ్ ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్ కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×