E-Paper
Advertisement

Shirisha : వికారాబాద్ జిల్లాలో యువతి హత్య కేసు.. పోస్టుమార్టం రిపోర్టే కీలకం..

Shirisha : వికారాబాద్ జిల్లాలో యువతి హత్య కేసు.. పోస్టుమార్టం రిపోర్టే కీలకం..
Advertisement

Shirisha : వికారాబాద్‌ జిల్లా కాళ్లాపూర్‌లో జరిగిన యువతి శిరీష హత్య కేసులో మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి బావ, కొంతమంది అనుమానితులను విచారిస్తున్నారు. శనివారం రాత్రి శిరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం పూరైంది. ఆ తర్వాత మృతదేహాన్ని శిరీష అన్న శ్రీకాంత్‌కు పోలీసులు అప్పగించారు.

శిరీష బావ అనిల్ ఈ దారుణానికి ఒడిగట్టునట్టు ఆరోపణలు వస్తున్నాయి. శిరీష ఫోన్ ఎక్కువగా వాడుతుండటంతో ఆమె సోదరుడు తిట్టినట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన అక్క భర్త అనిల్ కూడా శిరీషను కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైందని సమచాారం. ఆ తర్వాతే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది.

Advertisement

ఇంటికి కిలోమీటర్ దూరంలోని నీటి కుంటలో శిరీష మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు కోసి, కళ్లలో స్క్రూడ్రైవర్‌తో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆమెను ఒక్కరే చంపి ఉంటారని భావించడం లేదని పోలీసులు చెబుతున్నారు. శిరీష తండ్రి, సోదరుడిని కూడా ప్రశ్నించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×