E-Paper
Advertisement

Khammam: బస్సు-బుస్సు.. ఆర్టీసీ కేసీఆర్ తాతదా? పొంగులేటి ఫైర్.. రేవంత్ రయ్..

Khammam: బస్సు-బుస్సు.. ఆర్టీసీ కేసీఆర్ తాతదా? పొంగులేటి ఫైర్.. రేవంత్ రయ్..
Advertisement
khammam congress sabha

Khammam: ఖమ్మం వేదికగా కాంగ్రెస్ తలపెట్టిన తెలంగాణ గర్జనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాది మందితో సభ నిర్వహణకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఖమ్మంలో నిర్వహించబోయే రాహుల్ గాంధీ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులొచ్చినా సభ సక్సెస్ అవుతుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం చేరారు. ఖమ్మం డీసీసీ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ గర్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడంపై రేవంత్ రెడ్డి సైతం ఫైర్ అయ్యారు. బస్సులు, వాహనాలను అడ్డుకున్నా.. కాలినడకనైనా.. తొక్కుకుంటూ జనగర్జన సభకు రావాలంటూ రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. ఈ సభతో బీఆర్ఎస్ పార్టీకి సమాధి కడతామని అన్నారు.

Advertisement

సుమారు వందెకరాల సువిశాల ప్రాంగణంలో పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు ఖమ్మం బాట పడుతున్నారు.

రాహుల్ సభను విజయవంతం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని మాజీ మంత్రి పొంగులేటి ఆరోపించారు. ప్రైవేట్ వాహనాలు సభకు రాకుండా జిల్లా నలుమూలలా చెక్ పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ముందుగా బస్సులను ఇస్తామన్న ఆర్టీసీ యాజమాన్యం.. అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వెనక్కి తగ్గిందని పొంగులేటి ఆరోపించారు. ఆర్టీసీ ఏమైనా కేసీఆర్ తాత జాగీరా అని మండిపడ్డారు. తమ సొంత, వ్యక్తిగత వాహనాల్లో తెలంగాణ గర్జనకు తరలిరావాలని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ప్రజలను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. బహిరంగ సభకు మంచినీళ్ల సరఫరానూ కట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

Advertisement

మరోవైపు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులు రోడ్డెక్కారు. సభ కోసం వెళ్లే తమకు బస్సులు ఇవ్వాలంటూ డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. సత్తుపల్లి డిపో ఎదుట పిడమర్తి రవి, మణుగూరు డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాహుల్ సభకు ప్రజలను తరలించకుండా.. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్రలు పన్నుతున్నారని నేతలు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభను విజయవంతం చేసి తీరుతామని తేల్చిచెప్పారు కాంగ్రెస్ వాదులు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×