E-Paper
Advertisement

PM Modi Vs CM Revanth: పాలమూరులో హోరాహోరీ.. ఓ పక్క పీఎం.. మరో పక్క సీఎం!

PM Modi Vs CM Revanth: పాలమూరులో హోరాహోరీ.. ఓ పక్క పీఎం.. మరో పక్క సీఎం!
Advertisement

PM Modi and CM Revanth Meetings in Mahabubnagar: నాలుగోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రెండ్రోజుల్లో తెరపడనుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోటీ ప్రధానంగా కాంగ్రెస్ – బీజేపీల మధ్య కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎదురైన పరాభవమే మళ్లీ ఎదురవ్వక తప్పదన్న సంకేతాలు ఇప్పటికే వలువడ్డాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. పోటీపోటీగా ప్రచార సభలు, రోడ్ షో లు నిర్వహిస్తున్నాయి. జాతీయ నేతలంతా తెలంగాణకు క్యూ కట్టి.. సభలు, సమావేశాలు నిర్వహించారు.

ఇక ఎన్నికల ప్రచార పర్వం తుదిదశకు చేరుకుంది. ఈ రెండురోజుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో గంట తేడాతో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు జరగనున్నాయి. మక్తల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వస్తుండగా.. జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఇద్దరి సభల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

Advertisement

ఎవరి సభకు ఎంత ఎక్కువ మంది వస్తే.. వారి సభ విజయవంతం అయినట్లు. మరి గంట తేడాతో సభలు జరగనుండటంతో.. పీఎం, సీఎం సభల్లో ఎవరి సభకు ప్రజలు ఎక్కువగా వెళ్తారన్నది ఉత్కంఠగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరుపార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి రెండింటిలో ఏ పార్టీ అభ్యర్థి నెగ్గుతారో చూడాలి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డిలు పోటీలో ఉన్నారు.

Also Read : రూ. 150తో హైదరాబాద్‌కు వచ్చా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గానీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×