E-Paper
Advertisement

Phone Tapping Case: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు ఏఎస్పీలు అరెస్ట్

Phone Tapping Case: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు ఏఎస్పీలు అరెస్ట్
Advertisement
praneeth rao
praneeth rao

Phone Tapping Case (political news): రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. అదనపు ఎస్పీలు భుజంగరావు ,తిరుపతన్నలు తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అనధికారంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పటికే పలువురు ప్రముఖుల వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నట్లు గుర్తించారు. బాధ్యత గల ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ పలువురు వ్యక్తుల కోసం పనిచేసినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు గత ప్రభుత్వానికి ఫోన్ టాపింగ్ సమాచారం కూడా ఇచ్చినట్లు గుర్తించారు. టాపింగు డివైస్‌లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన నిందితుడు ప్రణీత్ రావును ఇప్పటికే 6 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. నేడు మరోసారి ప్రణీత్ రావును విచారించనున్నారు.

Advertisement

రేపు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో అరెస్టైన ఇద్దరు ఎస్పీలు వివిధ భాగాలకు చెందిన వారని డీఎస్పీ తెలిపారు. భుజంగరావు భూపాలపల్లి ఎస్పీ పనిచేస్తుండగా.. ఇంతకుముందు ఇంటెలిజెంట్ పొలిటికల్ వింగ్ లో అనదపు ఎస్పీగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక మరోవైపు ఎస్బీఐలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ తిరుపన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని పీఎస్ లో స్పెషల్ టీమ్ ముందు తిరుపన్న హాజరయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్బీఐలో పనిచేసిన వాళ్లందరినీ పోలీసులు విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని విచారించడం ద్వారా వచ్చే సమాచారంతో మరొకొంత మందిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పాల్గొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు భారీ పోలీస్ ఆపరేషన్ చేపట్టారు. ఇఖ డిసెంబర్ 4వ తేదీన ఈ కేసులో కీలక రికార్డులు ధ్వంసమైన సమయంలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై పోలీసులు స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే వికారాబాద్ ఫారెస్ట్, మూసీ రివర్ లో హార్డ్ డిస్కుల శకలాలు స్వాధీనం చేసుకున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×