E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. హరీష్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. హరీష్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
Advertisement

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు న్యాయస్థానానికి చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రమేయం ఉందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో ఈ వివాదంపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు కీలకంగా మారింది.

అయితే చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి గతంలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. రాజకీయ లబ్ధి కోసం, ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్‌కు వ్యూహరచన చేశారన్నది ప్రధాన ఆరోపణ. అయితే, ప్రాథమిక ఆధారాలు సరిగ్గా లేవన్న కారణంతో తెలంగాణ హైకోర్టు ఈ ఎఫ్ఐఆర్‌ను గతంలో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో, న్యాయపోరాటాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

Advertisement

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపితే, హరీష్ రావుతో పాటు మరికొందరు కీలక నేతలకు నోటీసులు అందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాల వెనుక అసలు సూత్రధారులు ఎవరో తేల్చాలని పట్టుదలతో ఉంది. మరోవైపు, ఇవన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలని, తమ నేతల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. న్యాయస్థానంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విచారణ ఎలా సాగుతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×