E-Paper
Advertisement

Hyderabad: తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్, జాయినింగ్ కమిటీ ఏర్పాటు

Hyderabad: తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్,  జాయినింగ్ కమిటీ ఏర్పాటు
Advertisement

Hyderabad: తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది జనసేన పార్టీ. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీలో చేరికలను సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేశారు అధినేత పవన్ కల్యాణ్.

తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్

Advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీ భాగ్యనగరంపై ఫోకస్ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ వంటి పార్టీలు తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ ఓ అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఉనికిని చాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది.

క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు జనసేనాని కార్యాచరణ మొదలుపెట్టారు. పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, మిగతా పార్టీల నుండి వచ్చే నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దానికి తెలంగాణ జాయినింగ్స్ కమిటీని నియమించారు.

Advertisement

జాయినింగ్ కమిటీ ఏర్పాటు.. పబ్లిక్ సభలకు ప్లాన్

ముఖ్యంగా పార్టీ భావజాలానికి ఆకర్షితులవుతున్న విద్యావంతులు, సామాజికవేత్తలు, మాజీ అధికారులు, తటస్థులను తీసుకొచ్చే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. తెలంగాణలో చేరికల విజ్ఞప్తులను తొలుత జాయినింగ్స్ కమిటీ పరిశీలిస్తుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు.

ఎన్నికల ముందు పొత్తు విషయం ఏమోగానీ కింది స్థాయిలో పార్టీని బలోపేత చేసే దిశగా జనసేన అడుగులు వేగంగా పడుతున్నాయి. అంతేకాదు అధినేత తో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలను మినీ సంగ్రామంగా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

ALSO READ: ‘SIR’ అంశంపై సీఎం రేవంత్ ఆగ్రహం.. పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×