E-Paper
Advertisement

Owaisi Tweet: “రష్యాలో హైదరాబాదీలను రక్షించాలి”.. జయశంకర్‌కు ఒవైసీ ట్వీట్..

Owaisi Tweet: “రష్యాలో హైదరాబాదీలను రక్షించాలి”.. జయశంకర్‌కు ఒవైసీ ట్వీట్..
Advertisement

Owaisi Tweet To Jaishankar To Save Hyderabadi’s From Russia: రష్యాలో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన ముగ్గురు భారతీయులను రక్షించాలని ఎఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫిబ్రవరి 21న విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను కోరారు.

అక్కడ చిక్కుకుపోయిన వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందినవారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన బాధితుడి కుటుంబ సభ్యులు ఒవైసీని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

Advertisement

భారతీయులను ఓ ఏజెంట్ మోసగించాడని, ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్‌గా పని చేస్తామని హామీ ఇచ్చి అక్కడికి పంపారని ఒవైసీ అన్నారు. వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ ఒవైసీ ‘X’లో పోస్ట్ చేశారు. బధితులను ఇంటికి తిరిగి తీసుకురావడానికి దయచేసి మీ మంచి కార్యాలయాలను ఉపయోగించండని ట్వీట్ ద్వారా ఒవైసీ కొరారు.

గత నెలలో కూడా ఒవైసీ జైశంకర్‌కు మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి కూడా తమ జోక్యం చేసుకోవాలని లేఖ రాశారు. వారు 25 రోజుల నుండి వారి కుటుంబాలను సంప్రదించడం లేదు. వారి కుటుంబాలు వారి గురించి చాలా ఆందోళన చెందుతున్నాయి. వారి కుటుంబాలను పోషించేది ఆ వ్యక్తులే కాబట్టి వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావాలని ఒవైసీ లేఖలో పేర్కొన్నారు. రష్యాలో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యంతో కలిసి పోరాడుతున్న భారతీయుల ఉనికిని నివేదించడం ఇదే తొలిసారిని ఆయన అన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×