E-Paper
Advertisement

MP Asaduddin Owaisi: నా దేశంలో రక్తం పారితే.. మీకే ఎక్కువ ప్రమాదం.. పాక్‌కు ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్

MP Asaduddin Owaisi: నా దేశంలో రక్తం పారితే.. మీకే ఎక్కువ ప్రమాదం.. పాక్‌కు ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

MP Asaduddin Owaisi: కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై  140 కోట్ల భారతీయ ప్రజలు రగలిపోతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు.

పాక్ తీరుపై ఓవైసీ ఫైర్

Advertisement

పాకిస్థాన్ సర్కార్, దాని నిఘా సంస్థ అయిన ఐఎస్ఐ (ISI) అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ను తక్షణమే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్ ఉంచాలని.. దీనికి సంబంధించి వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాకిస్థాన్ ఆర్మీ ప్రవర్తిస్తున్న వ్యవహరిశైలిపై కూడా ఆయన మండిపడ్డారు.

హిందూ- ముస్లింల మధ్య ఘర్షణలకు ప్రయత్నం..

Advertisement

భారత్ పై అణుబాంబులు వేస్తామని హెచ్చరించిన పాక్ మినిస్టర్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వ్యాఖ్యనించిన మినిస్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. ‘మీరు ఒక్కటి గుర్తించుకోవాలి.. మీరు మాతో పోలిస్తే ఒక అరగంట వెనుకబడి లేరు.. భారతదేశం కంటే అర్ధ శతాబ్ధం వెనుకబడి ఉన్నారు’ అని చెప్పారు. పాకిస్థాన్ దేశ బడ్జెట్ భారత సైనిక బడ్జెట్ కు కూడా సమానం కాదని చెప్పారు. హిందూ – ముస్లింల మధ్య ఘర్షణలు లేవనత్తడానికే పాకిస్థాన్, ఐఎస్ఐ, లష్కరే తోయిబా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

Also Read: UPSC Notification: యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకా 3 రోజులే ఛాన్స్..

అలాగే, భారత్ లో ‘రక్తం ప్రవహిస్తుంది’ అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కూడా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముందు మీ తల్లిని ఉగ్రవాదులు చంపారని.. ఆ విషయం తెలుసుకుని మాట్లాడాలని.. చిన్న పిల్లల మాదిరగా మాట్లాడకూడదని హెచ్చరించారు.

పాకిస్థాన్ పై తాము ఎలాంటి కుట్రలు చేయడం చేయడం లేదని.. కానీ వారు ఏదైనా చేస్తే ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని.. సూచించారు. ఒకవేళ భారత్ లో రక్తం ప్రవహిస్తే.. అది ఇటు వైపు కంటే.. పాక్ వైపే ఎక్కువగా ప్రవహించే అవకాశం ఉందని అసదుద్దీన్ ఓవైసీ ఫైరయ్యారు.

Also Read: NVS Recruitment: డిగ్రీ అర్హతతో నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. నెలకు రూ.35,750 జీతం.. వారం రోజులే..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×