E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్ కమిటీల్లో ‘టీడీపీ’ డామినేషన్.. నిజమెంత? వలసెంత?

Congress: కాంగ్రెస్ కమిటీల్లో ‘టీడీపీ’ డామినేషన్.. నిజమెంత? వలసెంత?
Advertisement

Congress: సీనియర్ల తిరుగుబాటు తెలంగాణ కాంగ్రెస్ లో కాక రేపుతోంది. తొమ్మిది మంది సీనియర్లు కలిసి.. భట్టి ఇంట్లో భేటీ అయి.. రేవంత్ రెడ్డిపై రెబెల్ జెండా ఎగరేయడం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ కమిటీల్లో ఆయన అనుచరులకే పదవులు ఇచ్చుకున్నారని.. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారనేది సీనియర్ల ప్రధాన ఆరోపణ. అందుకే, ఒరిజినల్ వర్సెస్ వలస.. వివాదాన్ని రాజేసి కాంగ్రెస్ లో కల్లోలం రేపారు. ఇంతకీ, సీనియర్లు ఆరోపించినట్టు కాంగ్రెస్ కమిటీల్లో వలస నేతలకే ఎక్కువ పదవులు దక్కాయా? టీడీపీ ఫ్లేవర్ ఎక్కువైందా? 108లో 50కి పైగా పదవులు వారికే ఇచ్చారా? ఇందులో నిజమెంత?

కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తోన్న ఆరోపణలకు మరో సీనియర్ లీడర్ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన 22 మంది తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఒక్క రేవంత్ రెడ్డి మినహా.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఒక్కరు కూడా లేరని స్పష్టం చేశారు. ఆ సీనియర్ల ఆరోపణలు అర్థం లేనివంటూ మండిపడ్డారు.

Advertisement

అలాగే, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు ఇద్దరే ఇద్దరు ఉన్నారని చెప్పారు. ఉపాధ్యక్ష పదవిలో 24 మంది ఉంటే, అందులో ఐదుగురే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు ఉన్నారన్నారు. ఇక, 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో కేవలం ఐదుగురే టీడీపీ వలస వాదులని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క జిల్లాకు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు డీసీసీ అధ్యక్షుడిగా లేరని చెప్పారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, మెనార్టీలు 68 శాతం ఉంటే.. ఓసీలు 32 శాతం ఉన్నారని వెల్లడించారు మల్లు రవి. తమకేదో అన్యాయం జరిగిపోయిందంటూ.. కొందరు సీనియర్లు కావాలనే రచ్చ చేస్తున్నారని విమర్శించారు.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×