E-Paper
Advertisement

Nagarkurnool: నాగర్‌కర్నూల్ స్కూల్‌లో కలెక్టర్ మార్క్ తనిఖీ.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ స్కూల్‌లో కలెక్టర్ మార్క్ తనిఖీ.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు!
Advertisement

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Advertisement

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వెళ్లిన ఆయన, విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించడమే లక్ష్యంగా ఆయన ఈ తనిఖీ చేపట్టారు.

మెనూ ఉల్లంఘనపై అసహనం

Advertisement

ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూ ప్రకారం సోమవారం విద్యార్థులకు కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ అందించాల్సి ఉంది. కానీ పాఠశాలలో కేవలం వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నట్లు కలెక్టర్ గుర్తించారు. మెనూను సక్రమంగా అమలు చేయకపోవడంపై ఆయన ఉపాధ్యాయులను నిలదీశారు.

నాసిరకం భోజనంపై తీవ్ర ఆగ్రహం

వడ్డించిన అన్నం, సాంబార్ ఏమాత్రం నాణ్యంగా లేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జిల్లాలో ఎన్నో పాఠశాలల్లో భోజనాన్ని పరిశీలించాను.. కానీ ఇంత నాసిరకం భోజనాన్ని ఎక్కడా చూడలేదు’ అని ఆయన మండిపడ్డారు. ఇటువంటి అజాగ్రత్త వల్ల విద్యార్థుల ఆరోగ్యం పాడవుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రధానోపాధ్యాయుడికి, టీచర్‌కు షోకాజ్ నోటీసులు

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ పాఠశాల హెడ్‌మాస్టర్ భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ బాధ్యత కలిగిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రమేష్ కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. వీరిద్దరికీ తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని సూచించారు.

పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ

కేవలం భోజనమే కాకుండా పాఠశాల ఆవరణ పరిశుభ్రతపై కూడా కలెక్టర్ దృష్టి సారించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండాలని సూచిస్తూ, స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

Also Read: మేడ్చల్‌లో వాటర్ వార్.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఇదే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×