E-Paper
Advertisement

Munugode : మునుగోడు.. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్..

Munugode : మునుగోడు.. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్..
Advertisement

Munugode : ఓపైపు మునుగోడు బైఎలక్షన్స్.. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర. ఈ రెండూ ఒకేసారి సమన్వయం చేసి గెలుపును మరింత సునాయాసం చేసుకొనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాయత్తం అవుతన్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నికలు జరుగనున్నాయి. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 23 నుంచి నవంబర్ 13 వరకు తెలంగాణలో కొనసాగనుంది. అయితే రాహుల్ జోడో యాత్రను మునుగోడు నుంచే మొదలుపెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెళ్లడించాయి.

ఇప్పటికే రాహుల్‌ గాంధీకి జోడోయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో రాహుల్‌కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. యువత, పిల్లలు, మహిళలు రాహుల్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీపడుతున్నారు. జోడో యాత్ర రాహుల్ పొలిటికల్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుగోడు నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమవుతే.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు.. మునుగోడు కాంగ్రెస్ జెండా మళ్లీ రెపరెపలాడ్డానికి మరింత దోహదం చేస్తున్నట్లు పలువురు అభిప్రయాపడుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×